25 April, 2026 | 4:31 PM

పూలే దంపతులు మార్గదర్శకులు

25-04-2026 02:54 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని నార్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పూలే దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలే దంపతులు సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.