13-02-2026 05:55:14 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గం, ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధి పోచారంలోని శ్రీస్పటికలింగేశ్వర ఆలయం 18వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన పూజ కార్యక్రమాలలో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy ) పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెరుకు సరిత బద్రి నారాయణ, మాజీ కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి, బద్దం మమత జగన్మోహన్ రెడ్డి, నాయకులు సామల యాదిరెడ్డి, ఆకిటి బాల్ రెడ్డి, నల్లవెల్లి శేఖర్, బద్దం జగన్ మోహన్ రెడ్డి, సామల సందీప్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.