calender_icon.png 19 June, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలంపిక్ రన్‌లో ఎమ్మెల్యే సాంబశివరావు

19-06-2025 12:25:52 AM

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 18 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస కాలనీలో గల మినీ స్టేడియంలో ఒలంపిక్ రన్ లో భాగంగా బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గుచూపి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్రీడలో శారీరక దారుణ్యానికి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం రూ 70 లక్షల వ్యయంతో షటిల్ బ్యాట్మెంటన్ మూడు కోర్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.