10 March, 2026 | 11:58 AM

ఒలంపిక్ రన్‌లో ఎమ్మెల్యే సాంబశివరావు

19-06-2025 12:25 AM

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 18 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస కాలనీలో గల మినీ స్టేడియంలో ఒలంపిక్ రన్ లో భాగంగా బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గుచూపి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్రీడలో శారీరక దారుణ్యానికి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం రూ 70 లక్షల వ్యయంతో షటిల్ బ్యాట్మెంటన్ మూడు కోర్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.