30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

కరెంటును కట్ చేసిన కాకి

19-06-2025 12:24 AM

అంధకారంలో సింగారం గ్రామం 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18, (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కాకి కరెంటు కట్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని సమితి సింగారం ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ఏరియా లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కరెంటు సరఫరాకు ఎక్కడ అంతరాయం ఏర్పడిందో ఆరా తీశారు.

చివరకు కరెంటు స్తంభం దగ్గర అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఓ కాకి కరెంటు స్తంభంపై గూడు పెట్టేందుకు ఆ వైర్ మొక్క జారే స్తంభం పైన ఉన్న ఫేస్ 1 ఫేస్, 2 పై పడటంతో మంటలు చెలరేగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో గంటన్నర పాటు సింగారం ప్రాంతంలో అంధకారం నెలకొంది. మరమ్మత్తుల అనంతరం విద్యుత్ వెలుగులు విరజమ్మాయి.