2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

కరెంటును కట్ చేసిన కాకి

19-06-2025 12:24 AM

అంధకారంలో సింగారం గ్రామం 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18, (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కాకి కరెంటు కట్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని సమితి సింగారం ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ఏరియా లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కరెంటు సరఫరాకు ఎక్కడ అంతరాయం ఏర్పడిందో ఆరా తీశారు.

చివరకు కరెంటు స్తంభం దగ్గర అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఓ కాకి కరెంటు స్తంభంపై గూడు పెట్టేందుకు ఆ వైర్ మొక్క జారే స్తంభం పైన ఉన్న ఫేస్ 1 ఫేస్, 2 పై పడటంతో మంటలు చెలరేగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో గంటన్నర పాటు సింగారం ప్రాంతంలో అంధకారం నెలకొంది. మరమ్మత్తుల అనంతరం విద్యుత్ వెలుగులు విరజమ్మాయి.