19-06-2025 12:24:40 AM
అంధకారంలో సింగారం గ్రామం
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18, (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కాకి కరెంటు కట్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని సమితి సింగారం ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ఏరియా లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కరెంటు సరఫరాకు ఎక్కడ అంతరాయం ఏర్పడిందో ఆరా తీశారు.
చివరకు కరెంటు స్తంభం దగ్గర అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. ఓ కాకి కరెంటు స్తంభంపై గూడు పెట్టేందుకు ఆ వైర్ మొక్క జారే స్తంభం పైన ఉన్న ఫేస్ 1 ఫేస్, 2 పై పడటంతో మంటలు చెలరేగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో గంటన్నర పాటు సింగారం ప్రాంతంలో అంధకారం నెలకొంది. మరమ్మత్తుల అనంతరం విద్యుత్ వెలుగులు విరజమ్మాయి.