19-06-2025 12:26:10 AM
పెద్దపల్లి పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ తనిఖీలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి, జూన్ 18(విజయ క్రాంతి): ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరాలు జరగక ముందే అడ్డుకట్ట వేయాలని రామగుండం సీపీ అం బర్ కిషోర్ జూ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను కమిషనర్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు పుష్పగుచ్చ లను అందజేసి స్వాగతం పలికారు.
ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రో డ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను కమిషనర్ స్టేషన్ సబ్ ఇన్స్ స్పెక్టరు ను అ డిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో నిర్వహిస్తు న్న పలురకాల రికార్డులను పరిశీంచారు.
అనంతరం మాట్లాడుతూ సీపీ పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కే సులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తర చుగా నేరాలకు పాల్పడే వారి నేరచరిత్ర ఆధారంగా రౌడీషీట్, సస్పెక్ట్ షీట్లతో పాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల ని ఆదేశించారు. ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరాలు జరగక ముందే అడ్డుకట్ట వేయాలని సూచించారు.
రాత్రి వేళల్లో వాహనతనిఖీలు ము మ్మరం చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, హాట్ స్పాట్లను గుర్తించి ఇతర ప్రభుత్వ శాఖ ల అధికారుల తో కలసి రోడ్డు ప్రమాదాల ని వారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించా రు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారు లకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని.
ఫిర్యాదు వచ్చి వెంటనే స్పందించాలని, ప్రజలకు పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గాటుగానే పోలీ సులు నీజాయితీ తో పనిచేయాలని కమిషనర్ తెలిపారు. పెద్దపల్లి సీఐ ఆఫీస్ తనిఖీ లో భాగంగా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సి డి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్ల ను పరిశీలించారు. నేరా పరిశోధన దర్యాప్తు లో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, నేరాలు నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
చివరగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.ఈ తనిఖీల్లో ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్.ఐ లక్ష్మణ్ రావు తో పాటు, సిసి హరీష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.