17-09-2025 01:56:37 AM
నకిరేకల్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ పనులను మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.
త్వరలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చామల శ్రీనివాస్ ,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్,, పన్నాల రాఘవరెడ్డి, మాదయాదగిరి లింగాల వెంకన్న, కంపసాటి శ్రీనివాస్ ,దార బిక్షం, మంగినపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు