1 July, 2026 | 9:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఎయిమ్స్‌కు ఎమ్మెల్సీ కవిత

19-07-2024 12:05 AM

జూలై 22 వరకు కస్టడీ పొడగింపు

న్యూఢిల్లీ జూలై 18: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ కేసులో కవిత కస్టడీని పొడగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఆమెకు అస్వస్థత నేపథ్యంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. జైలు అధి కారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. తన ఆరోగ్య సమస్యల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రెండు రోజుల క్రితం జైలులో కవిత అస్వస్థతకు గురికాగా... ఆమెను దీన్‌దయాళ్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.