24-04-2025 01:48:06 AM
112మంది ఓటర్లలో ఓటు వేసింది 88మంది
హైదరాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి అనురాగ్జయంతి
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాం తి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపా రు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతం ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు 112 మందిలో 88మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 112 ఓటర్లలో ఎక్స్అఫిషియో మెంబర్లు 31 కాగా, అందులో 22 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
81 మంది కార్పొరేటర్లలో 6౬ మంది ఓటు వేశారు. ఉదయం 8 గంట ల నుంచి 10 గంటల వరకు 37.51శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68 శాతం, మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57 శాతం పోలింగ్ నమోదైంది.
సాయంత్రం 4 గంటల వరకు 78.57 శాతం నమోదయ్యింది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను బందోబస్తుతో తీసుకువచ్చి..స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. ఈ నెల 25న ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కిం పు జీహెచ్ఎంసీ పన్వర్ హాల్లో జరుగుతుంది.