23 May, 2026 | 9:13 AM

యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది

29-10-2024 12:55 AM

ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన జెలెన్‌స్కీ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: భారత్ మధ్యవర్తిత్వంపై ఉక్రెయిన్ అధ్యక్షు డు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశా రు. తాజాగా ఓ భారతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుధ్దాన్ని ఆపే శక్తి సామర్థ్యాలు భారత ప్రధా ని నరేంద్ర మోదీకి ఉందన్నారు. రష్యా చర్చలు భారత్‌లోనే జరగడానికి ఆస్కారం ఉంద న్నారు.

రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని భారత్ నిలిపివేస్తే రష్యా దూకుడుకు కళ్లెం పడుతుందన్నారు. మోదీ గ్లోబల్ లీడర్ అంటూ జెలెన్‌స్కీ కొనియాడారు. అంతేకాకుండా రాబోయే అమెరికా ఎన్నిక ల్లో ట్రంప్ గెలిస్తే రష్యాకు బలం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వస్తే రష్యాకు సైనిక సహకారం అందించే అవకాశం ఉందన్నారు.