16-06-2025 02:25:16 AM
జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్
వారాసిగూడ, జూన్ 15 (విజయక్రాంతి) : మోదీ భారత ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని చేసిన సంస్కరణలు దేశ అభివృద్ధి ప్రజలకు వివరించాలని బీజేపీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ తెలిపారు బౌద్ధ నగర్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ అధ్యక్షతన డివిజన్ సంకల్ప సభ సమావేశానికి పాల్గొని మాట్లాడుతూ డివిజన్లో సమస్తాగతంగా డివిజన్ కమిటీలు సబ్ డివిజన్ కమిటీలు పూర్తిచేసుకుని కూడలి సమావేశాలు ఆ యొక్క సమావేశాలలో మోదీ చేసిన అభివృద్ధిని వివరించాలని భరత్ గౌడ్ తెలిపారు.
డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో వారసిగూడ చౌరస్తాలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి జన్మదినోత్సవాలు పురస్కరించుకొని వారాసిగూడ చౌరస్తాలో దినసరి కార్మికుల అడ్డాలో 500 మంది కార్మికులకు ఫలహారాలు అందజేశారు. అనంతరం జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్థానికులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకు లు వెంకటరమణి రాజశేఖర్ రెడ్డి రవి ప్రసాద్ గౌడ్ నాగేశ్వర్ రెడ్డి హరి దత్తు నీతి సత్యనారాయణ లడ్డు సారథి సాగర్ సంపత్ కొమరయ్య నాగరాజు సుధాకర్ సత్యనారాయణ కుమార్ సినిమా రాజు నవీన్ ఉమాపతి లింగం సుబ్బారావు అశోక్ నాగేష్ వెంకటేష్ నర్సింగ్ జయంత్ సురేష్ దీపక్ బిక్షపతి అమరావతి సరిత సుశీల నాగమణి కుందన్ రూప్ సాయి గజరాజు పాల్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.