calender_icon.png 17 June, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నివాస హక్కులపై దశాబ్దాలుగా పనిచేసిన వ్యక్తి అశ్వక్

16-06-2025 02:26:52 AM

మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకుడు జీవన్ కుమార్

ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): నివాస హక్కుల మీద దిగవంత అశ్వక్ దశాబ్దాలుగా పనిచేశారని మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకులు జీవన్ కుమా ర్ అన్నారు. మూసి బచావ్ ఆందోళన్ కి సారా ధ్యం వహించారని కొనియాడారు. ఈ మేరకు  ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రము ఖ నివాస హక్కుల నేత అశ్వక్ సంస్మరణ సభ మానవ హక్కుల వేదిక హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు అధ్యక్షతన పట్టణ సమస్యల ప్రాతిపదికగా జరిగిం ది.

జీవన్ కుమార్ మాట్లాడుతూ అశ్వక్ మలక్ పేటలోని మూసానగర్ బస్తీ నాయకుడి నుంచి నివాస హక్కుల నేతగా ఎదిగా రని గుర్తు చేశారు. బస్తీ సమస్యల పట్ల వివిధ వేదికలపై ప్రాతినిధ్యం వహిస్తూ పట్టణ సమస్యలపై తీవ్రంగా పోరాడారని తెలిపారు. మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్ ట్యూట్ సంస్థ ప్రతినిధి హైమ నగరంలోని నివాస హక్కుల ప్రస్తుత పరిస్థితుల గురించి, నివాస హక్కుల సాధనలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు.

అమన్ వేదిక వ్యవస్థాపకులు అనురాధ పట్టణ సమస్యలలో వీధి బాలలు పడే ఇబ్బందులు, బాల కార్మికుల గురించి వివరించారు. యుగంతర్ సంస్థ ప్రతినిధి కరీం అన్సారి మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ యువత ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా పాలకుల నిర్లక్ష్యం వల్ల చాలామంది యువత నేరారోపణలకు గురవుతు న్నారని వివరించారు. ఈ సభలో వసంత లక్ష్మి, వెంకట నారాయణ, ప్రముఖ సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.