10 May, 2026 | 1:21 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, బీద రాజీనామా

30-08-2024 12:49 AM
  1. రాజ్యసభ చైర్మన్ ఆమోదం 
  2. ఏపీలో రెండు స్థానాలు ఖాళీలు ఉన్నట్టు ప్రకటన

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యత్వానికి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు యాదవ్ గురువారం రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. వెంటనే ఏపీలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నట్టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఎంపీ పదవులకు రాజీనామా చేసి జగదీప్ ధన్కడ్‌కు అందజేశారు. అదే విధంగా వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

టీడీపీలో చేరుతున్నట్టు ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. మరో ఆరుగురు ఎంపీలు కూడా తమ పదవులతోపాటు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీవైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తొలినుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ, వ్యాపార వర్గాలనుంచి వచ్చినవారు కమలం వైపు వెళ్లవచ్చని అంటున్నారు.