calender_icon.png 9 June, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందుకు సాగని మొర్రేడు కరకట్ట పనులు

09-06-2025 12:07:14 AM

  1. ముంచుకొస్తున్న వానాకాలం 

భయాందోళనలో స్థానికులు 

పెరిగిన అంచనా వ్యయం 

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 8 (విజయ క్రాంతి) వానాకాలం ముంచుకొస్తుంది... వరదల భయం అలముకుంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో గల మొర్రేడు వాగు ముంపు భయం పట్టణవాసుల్లో అలుముకొంది. మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన కరకట్ట నిర్మాణానికి నేటికీ మోక్షం లేదు. పట్టణ నడిబొడ్డులో గల మొర్రేడు వాగు వరద ఉధృతితో వాగు ఇరువైపులా కోతకు గురవుతోంది.

వానాకాలం వస్తుందంటే కొత్తగూ డెంతో పాటు లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్, సంజయ్ నగర్ హమాలి కాలనీలలో నీ వాగు పక్కన ఉన్న ఇండ్లలోనీ జనం ఆందోళన మొదలైంది. గత కొన్ని సంవత్సరాలుగా మొర్రేడు బాగా ఉదిరితే పెరుగు తుంది. ఇరువైపులా భూమి భారీగా కోత గురై ఇప్పటికే 20 నుంచి 25 ఇండ్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరా యి.

సాగు భూమి సైతం కోతకు గురై మోటర్లు కొట్టుకుపోయి రైతులకు తీరని నష్టం కలిగిస్తోంది. మొర్రేడు వాగుకు కరకట్ట నిర్మించాలని 2023లో చేసిన ప్రతిపాదన నేటికీ కార్యరూపం దాల్చలేదు. అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కొత్తగూడెంలో పర్యటించిన సందర్భంగా ఆనాటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ రరావు మొర్రేడు వాగు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఆనాడే మొర్రేడు వాగు కరకట నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలంటూ నేటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ 150 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. నూతన టెక్నాలజీ తో నిర్మించేలా పథకం రూపొందించారు. దీంతో రూ 30 కోట్ల ను నదులు మంజూరు చేసినట్లు అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు.

అదే సమయంలో ఎన్నికలు రావడం అతను ఓడిపోవడం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సాంబశివరావు విజయం సాధించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే సైతం మొర్రేడు వాగుకు ఇరువైపులా కరకట్ట నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నేటిపారుదల శాఖ అధికారులతో పర్యటించి వాగును పరిశీలించారు. 

తిరిగి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. నిర్మాణంలో జాప్యం చోటు చేసుకోవడంతో అంచనా వ్యయం రూ 30 కోట్ల నుంచిరూ 50 కోట్ల వరకు పెరిగింది. పనులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. తిరిగి వర్షాకాలం సమయ పెంచడంతో స్థానికుల్లో వరద భయం చోటుచేసుకుంది.

కరకట్ట నిర్మాణం జరగకపోవడం వర్షాకాలం సమర్పించడంతో తమ పరిస్థితి ఏమి టనే ఆవేదన, ఆందోళన వారిలో అధికమైం ది. ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే యుద్ధ ప్రా తిపదికన ప్రధమ ప్రాధాన్యత పనిగా మొర్రే డు వాగుకు ఇరువైపులా కరకట్ట నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.