09-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ ౮ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రైతులకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తోంది. వ్యవసాయ విజ్ఞానాన్ని రైతులకు అందించి శాస్త్ర సాంకేతిక నైపుణ్యత వ్యవసాయ పంటల అభివృద్ధి వ్యవసాయ కార్యక్రమాలపై రైతు నేస్తం ద్వారా ప్రతినెల రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టిం ది.
నిర్మల్ జిల్లాలో వర్షా ఆధారంగా 70% రైతులు పంటలు పండిస్తున్నంతో ఖరీఫ్ యాసంగి సీజన్లో పంటలు సాగు చేసుకునే రైతులకు దుక్కులు దున్నే విధానం భూసార పరీక్షలు విత్తనాల ఎంపిక ఎరువుల వాడకం క్రిమిసంహారక చర్యలు పంట ఉత్పత్తుల ప్రాధాన్యత ఇతర అంశాలపై రైతు వేదికలో దృశ్య శ్రావణం ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
నిర్మల్ జిల్లాలో మూడు వ్యవసాయ సబ్ డివిజన్లు ఉండగా 79 రైతు వేదికలను ఏర్పాటుచేసి క్లస్టర్లుగా విభజించి వ్యవస్థాయ విస్తరణ అధికారుల సమక్షంలో రైతులకు కావలసిన వ్యవసాయ సూచనలు సలహాలు అందిస్తూ పంట ఉత్పత్తుల పెరుగుదల మార్కెటింగ్ ఇతర సదు పాయాలకు రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయ విజ్ఞానం అందిస్తున్నారు. వ్యవసాయ క్లస్టర్లో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు నిత్యం అందుబాటులో ఉండి ఏ సహకారం కావాలన్నా అందిస్తున్నారు.
రైతులకు మరింత ప్రయోజనం
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ సీజన్ నుంచి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ఇతర వ్యవసా య యూనివర్సిటీ నుంచి పరిశోధనాత్మక వ్యవసాయ విధులంపై రైతులకు కొత్త విజ్ఞానాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికి రైతు వేదిక లో రైతు నేస్తం కోసం దృశ్య శ్రావణ పరికరాలను ఏర్పాటు చేయడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు నెలలో ఒకసారి రైతులందరినీ అక్కడ పోగుచేసి రైతు నేస్తం ద్వా రా వ్యవసాయ విజ్ఞానం దాని అనుబంధం రంగాలపై రైతు అభ్యున్నతి కోసం తీసుకున్న చర్యలు వివరిస్తున్నారు.
జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా మొదటి విడత కింద 32 క్లస్టర్లు రైతు నేస్తం కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం అమలు చేస్తుంది. వ్యవసా యం పంటల సాగుచేస్తా రైతులకు భూసార పరీక్షలు దుక్కులు దున్నే విధానం విత్తనాల ఎంపిక ఎరువుల వినియోగం సస్యరక్షణ చర్యలు పంటల మార్కె టింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
వ్యవ సాయంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఉద్యానవన పంటలు పట్టు పరిశ్రమ స్వస్థమర్థక శాఖ మత్స్య పరిశ్రమ నీటిపారుదల శాఖ సహకార సం ఘాలు పెద్ద అంశాలపై కూడా రైతులకు సూచనలు సలహాలు అందిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ నిప్పులతో అవగాహన ఆన్లైన్ విధానం దృశ్య శ్రావణం వినిపిస్తున్నారు.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో మంచి పట్టు సాధించి అధిక దిగుబడులు ఆలయ వనరులను పెంచుకుంటున్న రైతుల అభిప్రాయాలతో కూడిన వీడియోలను రైతులకు రైతుల అభిప్రాయాల వినిపించడంతో రైతు లు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎక్కువ శాతం అక్షరాస్యత లేని వారికి వారికి వ్యవసాయ శాఖ అధికారులు అనుభవజ్ఞులతో కూడిన రైతుల విజయవంతలను కళ్ల కు కట్టినట్టు చూపడం వల్ల రైతులు వాటికిఅలవాటు అవుతున్నట్టు వ్యవసాయ శాఖ శాఖ అధికారులు తెలిపారు.