calender_icon.png 15 June, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన జాతి జాగృతం కోసం మరిన్ని పుస్తకాలు తేవాలి..

11-06-2025 01:11:59 AM

టిజెఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్  కోదండరాం

ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): బంజార ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే ఆనాటి గిరిజనుల జీవన స్థిగతులపై 1973లో రూపొందించిన ఆంగ్ల మోనోగ్రాఫ్ ను నేటి తరానికి ఉపయోగపడేలా తెలుగులో అనువదించి ప్రచురించడం అభినందనీయం అని టిజెఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ.కోదండరాం అన్నారు.

గిరిజన జాతి జాగృతం కోసం ఇలాంటి పుస్తకాలు మరిన్ని తేవాల్సిన అవసరం ఉందని మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బంజార రచయితల సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో  రూపొందించిన ‘1961లో బంజారా గిరిజనుల జీవనం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం డిఆర్‌ఎస్.కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గిరిజన జాతుల గత, నేటి పరిస్థితులు, వారి జీవన విధానంపై రచయిత కూలంకషంగా తెలుసుకుని మరో ప్రచురణ తేవాలని సూచించారు. ఇలాంటి ప్రచురనలు గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విధానాల రూపకల్పనకు తోడ్పడతాయన్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతులను సంబందిత ప్రభుత్వ అధికారులకు కూడా అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనువాదకులు ప్రొఫెసర్ జె.రాజారాం నాయక్, అంగోతు రాంబాబు నాయక్, ముడావత్ రాము నాయక్, తదితరులు పాల్గొన్నారు.