11-06-2025 01:10:04 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ర్టంలో అక్రమ మద్యం రవా ణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రొహిబిషన్ అం డ్ ఎక్సుజ్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పా టు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రైళ్లు, వాహనాల్లో తనిఖీ చేసి రూ.25 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడు ల్లో 33 మందిని అరెస్ట్ చేసి, వారి కుట్రను భగ్నం చేశారు.
ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎక్సుజ్ శాఖ రాష్ర్టవ్యాప్తంగా స్టేట్ టాస్క్ఫోర్స్, ఏరియా కంట్రోల్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ఫోర్స్ బృందాలతో పాటు స్థానిక ఎక్సుజ్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 64 కేసులు నమోదు చేసి, 33 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 19 వాహనాలను సీజ్ చేశారు.
మొత్తంగా 1,188 మద్యం బాటిళ్లు, 22 లీటర్ల బీరు, 21 లీటర్ల గుడుంబాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులు ప్రధానంగా ఢిల్లీ, గోవా రాష్ట్రాల నుంచి రైళ్ల మార్గంలో ఎన్డీపీఎల్ మద్యాన్ని తెలంగాణకు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ఆ మార్గాలపై దృష్టి సారించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానితుల బ్యాగులను తనిఖీ చేసి 40 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు.
అదేవిధంగా, గోవా నుంచి వచ్చే వాస్కోడిగామా ఎక్స్ప్రెస్లో వికారాబాద్ ఎక్సుజ్, డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా దాడులు చేసి భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పట్టుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో గోవా నుంచి తెచ్చిన మద్యం, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న డిఫెన్స్ కోటా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనూ ఈ దాడులు కొనసాగాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి వంటి సరిహద్దు ప్రాంతాల్లో దేశీదారు స్థావరాలపై దాడులు చేసి మద్యాన్ని ధ్వంసం చేశారు.
నిరంతరం దాడులు
వారం రోజుల్లో ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ బృందాలతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది సాధించిన ఫలితాలు అభినందనీయం. నిరంతరం దాడులు నిర్వహించి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పూర్తిగా అరికట్టాలి. పన్ను చెల్లించని, నాణ్యత లేని మద్యాన్ని వినియోగించడం ఆరోగ్యానికి హానికరం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
షానవాజ్ ఖాసీం, ఎక్సుజ్ డైరెక్టర్