calender_icon.png 7 June, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ మల్లు రవి గెలుపునకు రక్తం ధారపోశా

07-06-2025 01:39:15 AM

  1. మాజీమంత్రి హరీశ్ శవాలపై పేలాలు ఏరుకొనే రకం 
  2. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ 

హైదరాబాద్, జూన్ ౬ (విజయక్రాంతి): పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లు రవిని ఎంపీగా గెలిపించుకోవడానికి తాను రక్తం ధార పోశానని, ఇప్పుడు ఆయనకు అవే మి గుర్తుకులేవని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో చిటాచాట్ నిర్వహించారు.

కాంగ్రెస్ ఎంపీగా మల్లు రవి అధికారికంగా మీటింగ్ పెడితే బా గుండేదని, అనధికారికంగా బీఆర్‌ఎస్ నాయకులతో మల్లు రవి మీటిం గ్ పెట్టారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజేయుడిని పూల బోకేలు, శాలువా లతో సత్కరించారని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజేయుడు ఎప్పటి కైనా కాంగ్రెస్‌లోకి వచ్చే వ్యక్తి అని మల్లు రవి కామెంట్స్ చేయడం బా ధాకరమని వాపోయారు.

అలంపూర్‌లో జరుగుతున్న పరిణామాలను ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించామని, చర్యలు తీసు కోవాలని ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మాజీమంత్రి హరీశ్‌రావు శవాలపై పేలాలు ఏరుకొనే రకమని సంపత్‌కుమార్ మండిపడ్డారు. విత్తనాల ఫ్యాక్టరీపై హరీశ్ పచ్చి అబ ద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థానిక ప్రజల బాగోగులు పట్టించుకోకుండా హరీశ్‌రావు, స్వా ర్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.