14-06-2025 12:00:00 AM
సీతక్కను మార్చడంపై సీనియర్ నేతల్లో ఆనందం
నిర్మల్ జూన్ 13 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆనందమే తప్ప క్షేత్రస్థాయిలో తమకు గుర్తింపు ఉండడ ం లేదని సీనియర్ కార్యకర్తలు పార్టీ నేతలు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో కొత్త ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తోనైనా మార్పు వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సీనియర్ మంత్రిగా ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న జూపల్లి కృష్ణారావు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులు కావడంతో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే తో పాటు ముఖ్య నాయకులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతారో అన్న చర్చ జరుగుతుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదిలాబాద్ పార్లమెం ట్ స్థానం బిజెపి ప్రాతినిథ్యం వహిస్తుండగా పెద్దపల్లి పార్లమెంటు స్థానం మంత్రి జి వెంకటస్వామి కుమారుడు వంశీ ప్రాధేత్య వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో తూర్పు పడమర జిల్లాలు గా ఆదిలాబాద్ మంచిర్యాలను పేర్కొంటారు.
పశ్చిమ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా బుజ్జి పటేల్ ఒక్కరే ప్రాథమిత్యం వైస్తుండగా నిర్మల్ ముధోల్ అదిలాబాద్ నియోజకవర్గాల్లో బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ పాయల్ శంకర్ ప్రాతినిథ్యం వహిస్తుండగా బోత్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇక తూర్పు జిల్లా విషయానికొస్తే అక్కడ చెన్నూరు నుంచి గెలుపొందిన వివేక్ వెంకటస్వామిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోగా ఆయన సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి మం చిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆసిఫాబాద్ నుండి కోవలక్ష్మి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రాథమిథ్యం వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యే లతోపాటు గతంలో టిఆర్ఎస్ ఇతర పార్టీలో పనిచేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు అందరు కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతలతో వర్గ విభేదాలు ఏర్పడి ఎవరికి వారే యమున తీరే అని రీతిలో వివరించడంతో నిజమైన కార్యకర్తలకు ఏ నాయకుడు వద్దకు వెళ్లాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.
ప్రతి నియోజకవర్గంలో సీనియర్ జూనియర్ నాయకుల మధ్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడడంతో పార్టీకి కార్యకర్తలకు నష్టం జరుగుతుందని సమావేశాల్లో పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియించబడ్డ అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లాలో వర్గ విభేదాలను సమసి పోయించేందుకు కృషి చేసినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో సీతక్కతో కూడా కొందరు ముఖ్య నేతలు అంటి ముట్టనట్టు వివరిస్తున్నట్టు ప్రచారం జరిగింది.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను ఆమె పట్టించుకోకపోవడంతో కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చి ఇన్చార్జి మంత్రిని మార్చాలన్న అభిప్రా యం వెలుగు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. సీతక్క ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందని కొందరు సీనియర్ నేతలు బహిరం గంగానే ఆరోపించారు. ముఖ్యంగా నిర్మల్ అదిలాబాద్ ముధోల్ మంచిరాల్లో ఈ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
జూపల్లితో పార్టీ పరిస్థితి మారేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సీనియర్ నాయకునిగా అనేకసార్లు మంత్రి పదవి పొందిన జూపల్లి కృష్ణారావు ను ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించడంపై ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు పార్టీ పరిస్థితి మారుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వివిధ మంత్రి పదవులను పొందిన జూపల్లి కృష్ణారావు ముక్కు సూటిగా వివరిస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఆయనకు రాజకీయ అనుభవం పదవుల అనుభవం ఉండటం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సీనియర్ జూనియర్ నాయకులతో మంచి సంబంధాలు ఉండడంతో వారందరినీ ఏకతపై తీసుకొచ్చేం దుకు జిల్లా ఇన్చార్జి మంత్రి కృషి చేస్తారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జిల్లాలో మాజీ మంత్రిగా పనిచేసిన ఏ ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేసిన వేణుగోపాల చారి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జి వినోద్ ఆదిలాబాద్ కు చెందిన జోగు రామన్న తో మంచి సంబంధాలు ఉన్నాయి.
అలాగే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసిన క్యాడర్ తో కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉండడంతో జిల్లాలో ఇన్చార్జి మంత్రి ప్రభావం ఐక్యతపై ఉంటుందని కొందరు సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా జిల్లాలో అనేకసార్లు పర్యటించిన జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా రాజకీయ స్థితిగతులు ఇక్కడి వాతావరణ పరిస్థితులు ప్రజల స్థితిగతులు తదితర అంశాలపై అవగాహన ఉండడంతో జూపల్లి ఇంచార్జి మంత్రిగా సక్సెస్ అవుతారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను జూపల్లి కృషితో పూర్వపు అదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పట్టు సాధిస్తుందని అందుకే సీనియర్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావుకు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇది ఏమైనా ఉమ్మడి జిల్లా బాధ్యులకు జిల్లా ఇన్చార్జి మంత్రి మార్చడం సీనియర్ మంత్రిగా ఉన్న జూపల్లికి బాధితులు అప్పగించడం మంచిర్యాల జిల్లాకు చెందిన వివేక్ వెంకట స్వామికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు సద్దుమణిగే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు జూపల్లి కృష్ణారావు ఏ మేరకు సక్సెస్ అవుతారో కాలమే వేచి చూడాలి.