21-02-2026 12:00:00 AM
మరిపెడ, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): మరిపెడ మండల కేంద్రం కార్గిల్ సెంటర్ మీపంలో శుక్రవారం డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల, మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి చాయ్ మిల్లెట్ టీ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి పెంపొందించుకొని స్థానిక వనరులతో వ్యాపార అభివృద్ధి సాధించాలని కోరారు.
అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని యువత యొక్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యువత స్వయం ఉపాధికై రుణాలు అందజేస్తున్నయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత, వార్డు కౌన్సిలర్లు పానుగోతు రాములు , మెరుగు రాము పాల్గొన్నారు.