16 April, 2026 | 8:02 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

30-10-2025 12:09 AM

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు

కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి గడ్డ నుండి బిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో  ఈ నెల 18న జరిగిన బీసీ జేఏసీ బంద్ విజయంలో సమిష్టి కృషి ఉందన్నారు. ఈ బంద్ విజయం స్పూర్తితో త్వరలో నిరంతర కార్యాచరణని రూపొందిస్తున్నామన్నారు.

కామారెడ్డి గడ్డ నుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లుని చట్టబద్ధంగా 9వ షెడ్యూల్ లో చేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. అగ్రవర్ణ అహంకారుల కుట్రల్ని తిప్పికొట్టే విదంగా, బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా కృషి చేస్తామని అన్నారు. అఖిలపక్ష రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీ ల రిజర్వేషన్లు కు మద్దతు తెలిపిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు చట్టబద్ధంగా అయ్యే విధంగా పార్లమెంట్‌లో ఆమోదం తెలిపి, 9వ షెడ్యూల్‌లో చేర్చే విధంగా ఉద్యమాన్ని చెయాలని అన్నారు.

స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు విద్యా, ఉద్యోగ రంగాల లో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో నీల నాగరాజు, సాప శివరాములు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఎంజీ వేణు గోపాల్ గౌడ్, గణేష్ నాయక్, క్యాతం సిద్ధరాములు, వెంకట్ గౌడ్, మర్కంటి భూమన్న, చింతల శంకర్, రాజన్న, నర్సింలు, బాజ లలిత, కొత్తపల్లి మల్లన్న, మంజుల, అరుణ్, విట్ఠల్, రాజీవ్, రాజేందర్, హఫీజ్, శ్రీనివాస్, సాయికృష్ణ, ఆనంద్ పాల్గొన్నారు.