పలు డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పర్యటన
10-03-2026 06:08 PM
పారిశుద్ధ్య పనుల పరిశీలన
పాల్వంచ,(విజయక్రాంతి): కొత్తగూడెం నగర్ పాలక సంస్థ పాల్వంచ డివిజన్ పరిధిలోని 35,44 డివిజన్లలో మంగళవారం మేయర్ గణేష్ పర్యటించి పారిశుధ్య పనులను పరివేక్షించారు. ఆయా డివిజన్లలో ఉన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న మేడికుంట చెరువు కబ్జా గురైందని మేయర్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. మేడికుంట చెరువును పరిరక్షించాలని, చెరువు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ఆయన అధికారులకు ఆదర్శించారు. మేయర్ వెంట డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి , పలు డివిజన్లకు చెందిన సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు,సిపిఐ నాయకులు పాల్గొన్నారు.




