1 July, 2026 | 10:27 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మహిళ దారుణ హత్య

10-03-2026 06:12 PM

* హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

* కేసు నమోదు చేసిన పోలీసులు

పాపన్నపేట: మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన ఏడుపాయల ఆలయం సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మెదక్ లో కూలీ పనులకు వెళ్తూ జీవిస్తుంది. కాగా సోమవారం ఉదయం ఇంట్లో నుంచి కూలీ పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఇంటి వద్ద ఉన్న కుమారుడు రాజేష్ బంధువులకు సమాచారం అందించాడు.

చుట్టూ పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఏడుపాయల సమీపంలోని చెలిమకుంట వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి ముఖంపై కర్రతో దాడి చేసిన బలమైన గాయం ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి సోదరుడు దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.