1 April, 2026 | 2:03 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ముర్ముకు ఫిజీ అత్యున్నత పురస్కారం

07-08-2024 02:49 AM

దేశ అధ్యక్షడు కటోనివేర్ చేతుల మీదుగా ప్రదానం

ఫిజీకి భారత్ అండగా ఉంటుందన్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆగస్టు 6: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటన లో ఉన్న ముర్ముకు సోమవారం ఆ దేశ అధ్యక్షుడు ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా ఫిజీ పార్ల మెంట్‌ను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఫిజీని బలమైన, సంపన్న మైన దేశంగా మార్చేందుకు భారత దేశం ఆర్థికంగా, వాణిజ్యపరంగా అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పదేళ్ల క్రితం ఫిజీ పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను ముర్ము గుర్తుచేశారు. కాగా ఫిజీలో పర్యటించడం రాష్ట్రపతికి ఇదే మొదటిసారి.