calender_icon.png 29 June, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం అప్రమత్తంగా వుండాలి...

29-06-2025 12:09:59 AM

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు...

కేసుల పరిశోధనలో పారదర్శకంగా ఉండాలి..

పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాల,(విజయక్రాంతి): శాంతి భద్రతల, నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా 24 గంటలు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. నెలవారి సమీక్షలో భాగంగా శని వారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పోలీస్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

పోలీస్‌ స్టేషన్‌, డివిజిన్, జోన్ ల వారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే అంశాలపై అధికారులతో సమీక్షా జరిపారు. 

ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకోవాలి...

కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని సిపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. కేసు నమోదయిన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, స్టేషన్‌ అధికారులు ప్రతి రోజు గంట పాటు పెండింగ్‌ కేసులను సమీక్షా జరపాలని, పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలని కోరారు. మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని, రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహిరంచాలని, దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌  ముమ్మరం చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, అధికారుల పనితీరుపైనే కీర్తి ప్రతిష్టలు ఆధారపడి వుంటాయని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, కమీషనరేట్ పరిది ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు.