మృతుల కుటుంబాలను పరామర్శించిన నాగజ్యోతి
24-04-2025 02:46 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటన తెలుసుకొని ములుగు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకుని, మృతుల బంధువులను ఓదార్చారు.




