22 April, 2026 | 7:24 PM

Breaking News

ఉపాధి హామీలో రికార్డు స్థాయి కూలీలు   •   ఐలేని రెడ్డి సంఘం అధ్యక్షునిగా మల్లారెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •  

సాయుధ పోరాటంలో నల్లగొండది కీలకపాత్ర

18-09-2025 01:52 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలకపాత్ర పోషించిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి,

మాట్లాడారు. భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, శాలిగౌరారం, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయని తెలిపారు. కాగా రాబోయే రోజుల్లో మరింత కష్టపడి నల్లగొండ జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు