13-06-2025 01:21:11 AM
మీడియా సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్ అర్బన్, జూన్ 12: భారత పౌరుడు గర్వించేలా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం శామీర్పేట్లోని ఆయన నివాసంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలనపై మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 సంవత్సరానికి ముందు దేశ ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు.
దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని దేశ ప్రజలు బిజెపి కి పట్టంకట్టారని, ప్రజల నమ్మకాన్ని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. భారత పౌరుడు గర్వించేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్నారు. ఆర్ధిక వ్యవస్థ పూర్తిక పడిపోయిన తరుణంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆర్ధిక వ్యవస్థ 4వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలతో మంచి స్నేహపూరిత వాతావరం తీసుకువచ్చారని చెప్పారు.
పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత మహిళల బొట్టు తుడిచేలా భార్యలముందే భర్తలను చంపిన ఘటనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకారం తీర్చుకుందన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మాజీ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి,
ఉమ్మడి శామీర్ పేట్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, మేడ్చల్ మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం, శామీర్ పేట్ మండల బిజెపి అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు శైలజ హరినాథ్, మాజీ కౌన్సిలర్ హంస రాణి కృష్ణ గౌడ్, నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.