19-11-2025 07:45:05 PM
గద్వాల: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు ఆదేశాలతో (బుధవారం ) శ్రీ. సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థినిలకు ముగ్గుల పోటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి గారు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ... ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ ప్రశంసించారు.
విద్యార్థులు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వివిధ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రగతి విద్యానికేతన్ స్కూల్, కాకతీయ టెక్నో స్కూల్, విశ్వేశ్వరయ్య మెమోరియల్ హై స్కూల్, శారద హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, విద్యార్థినీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.