19-11-2025 07:42:18 PM
రాజాపూర్: మండలంలోని మల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్తీక వానభోజనాలకు వెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు రవి నాయక్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి కార్తీక వన భోజనము చేసినట్లు తెలిపారు. కళావతి టీచర్ సహకారాలతో విద్యార్థుల కొరకు స్వీట్లు, వంటకాలు చేయించి వడ్డించడం విందు అరగించి ఉత్సాహంగా గడిపినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయినీలు కళావతి, శిరీష, మణెమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.