calender_icon.png 9 February, 2026 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

09-02-2026 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్, ఓబి, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కొత్త బొగ్గు బావులు ప్రారంభించి, బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో  జిల్లా కౌన్సిల్ సభ్యులు కొయ్యడా సాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.