calender_icon.png 4 August, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశువు ప్రాణం తీసిన నిర్లక్ష్యం

04-08-2025 01:28:46 AM

  1. డ్యూటీ మారాలంటూ అంబులెన్స్ సిబ్బంది కాలయాపన

2 గంటల పాటు గర్భిణి నరకయాతన

డెలివరీ అనంతరం శిశువు మృతి

నాగర్‌కర్నూల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతూ అంబులెన్స్‌ని ఆశ్రయించిన గర్భిణిని పట్టించుకోకుండా సుమారు రెండు గంటల పాటు అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంవహించింది. నరకయాతన అనుభవిస్తున్నా డ్యూటీ మారడం కోసం కాలయాపన చేయడంతో ఆసుపత్రికి ఆలస్యంగా చేర్చారు. దీంతో శిశువు మృత్యువాత పడింది. ఈ ఘటననాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండ లంలో ఆదివారం చోటుచేసుకుంది.

మం డల పరిధిలోని చిన్న కార్పాముల గ్రామానికి చెందిన మనీషా మొదటి కాన్పు కోసం పురిటి నొప్పులతో బాధపడుతూ 108 అంబులెన్స్‌ను ఆశ్రయించింది. అంబులెన్స్‌లోకి ఎక్కించుకున్న సిబ్బంది తన డ్యూటీ మారాల్సి ఉందని సాకు చూపి మండల కేంద్రంలోనే సుమారు రెండు గంటల పాటు నిలిపి ఉంచాడు. ఆస్పత్రికైనా చేర్చాలని ప్రాధేయపడటంతో అక్కడే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

కానీ అక్కడి స్టాఫ్ నర్స్ పరిస్థితి విషమంగా ఉందని నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది. షిఫ్ట్ మారిన అనం తరం నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి డెలివరీ చేశారు. ఆ క్రమంలో శిశువు మృతి చెందింది. అం బులెన్స్‌లోనే ఆలస్యం చేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త నరసింహ బంధువులు డిమాండ్ చేశారు.