25-06-2025 12:23:32 AM
పటాన్ చెరు, జూన్ 24 : తెల్లాపూర్, గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్లుగా బదిలీపై వచ్చిన అజయ్ కుమార్ రెడ్డి, వెంకట రామయ్యలు మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
మున్సిపాలిటీల అభివృద్ధిలో కమిషనర్లది అత్యంత కీలక పాత్ర అని ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.