25-06-2025 12:23:01 AM
ఏటూరునాగారం,ములుగు ప్రతినిధి, జూన్24 (విజయక్రాంతి):ములుగు జిల్లాలో వర్షం కురవడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో వానాకాలం సాగు సందడి మొదలైంది. నైరుతి రుతుపవనవాల కోసం ఎదురుచూస్తున్న రైతులు వర్షం పడడంతో పొలంబాట పట్టారు మండుతున్న ఎండలు.. తట్టుకోలేని ఉక్కపోత భరింత లేని వేడిగాలులతో వేసవికాలం వలే తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు సోమవారం తెల్లవారు జామున కురిసిన వర్షం కాస్తాంత సేద తీర్చింది.
గత నాలుగు నెలలుగా ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజానీకం ఒకేసారి వాతావరణం చల్లబడటంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం నుంచి వర్షకాలంలోకి అడుగుపెట్టిన తర్వాత వాతావరణంలో పెన్ను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి ఒకేసారి వాతావరణం చల్లబడి వర్షం ప్రారంభమయ్యాయి కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, తాడ్వాయి, మండలాల్లో సోమవారం తెల్లవారుజామున 4గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
ప్రజలకు ఈ వర్షం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మండలాల్లోని గ్రామాల సైతం ఈ వర్షంతో రైతులకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. ఇక నుంచి ఖరీఫ్ సాగు పనులలో రైతులు బిజీ కానున్నారు. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా జూన్ మాసం చివరిలో కురవడంతో రైతులు ఖరీఫ్ సాగు కోసం అన్నదాతలు ఎదురు చూశారు ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు కురవలేదు సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురివడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక నుంచి రైతులు ఖరీఫ్ సాగు కోసం విత్తనాల సేకరణ,ఎరువుల సేకరణ,విత్తనాలను విత్తుకోవడంలో నిమగం కానున్నారు. ఏదేమైనప్పటికీ సోమవారం ఉరుములు,మెరుపులతో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ విత్తనాలతో భయపడుతున్న రైతన్నలు
నకిలీ విత్తనాల భయం జిల్లాలో రైతులు మిర్చి,వరి,పత్తి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే నకిలీ విత్తనాల భయం వెంటాడుతోంది. ములుగు జిల్లాలో ఉన్న 9 మండాలలాకు ఏటా నకిలీ విత్తనాలు వచ్చి చేరుతున్నాయి. ఏవి అసలు? ఏవి నకిలీవో? తెలియక రైతులు మోస పోతున్నారు. వ్యవసాయ శాఖ, టాస్క్ఫోర్స్ బృందాలు నిఘా పెట్టినా గుట్టు చప్పుడు కాకుండా పల్లెల్లో బిల్లులు లేకుండా విత్తనాల విక్రయం జరుగుతోంది.
రైతులు నకిలీ విత్తనాలపై భయపడుతూనే దళారులు చెబుతున్న మాటలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన నకిలీ రసాయనాలు కూడా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. నకిలీ విత్తనాలపై నిఘా పెంచాలని రైతులు కోరుతున్నారు