25-06-2025 12:24:16 AM
వరంగల్, జూన్ 24 (విజయ క్రాంతి): వరంగల్ ఈనాడు దినపత్రిక బ్యూరో చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న జీడిపల్లి దత్తు రెడ్డి (37) గుండెపోటుతో మరణించారు. ఇంట్లో ఉండగా సోమవారం రాత్రి 10:30 గంటలకు తీవ్ర గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దత్తు రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెల చెరువు లో నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్ లో బదిలీపై వరంగల్ కు వచ్చారు. దత్తు రెడ్డి మరణం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.