calender_icon.png 15 September, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల పరిష్కారంలో నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం

15-09-2025 12:18:46 AM

-నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య

-జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో 7,444 కేసులలో రాజీ 

-సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 42,45, 27300 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేత

నిజామాబాద్ సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి) : జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, శనివారం నిజామాబాద్ జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్-అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన , రాజీ పడటానికి అవకాశం ఉన్న 7, 444 వందల కేసులను ఇరు వర్గా లు రాజి పడడంతో పరిష్కారమయ్యాయి. వేల సంఖ్యలో కేసులు పరిష్కారం అవడంతో నిజామాబాద్ జిల్లాకు నాలుగో స్థానం దక్కింది.

కోర్టుల్లో చాలా కాలంగా నడుస్తున్న కేసులలో ఐ.పి.సి, బి.ఎన్.ఎస్,501 కేసులు సైబర్ క్రైమ్, 138 కేసులు ఇ-పెట్టి 1958 కేసులు డి.డి, ఎంవి యాక్ట్ 4,985 కేసులు మొత్తం 7,444 కేసులలో ఇరు వర్గాలను రాజీ  కుదిరించి కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా నిజామాబాదు జిల్లా కు సైబర్ క్రైమ్ వివిధ కేసులలో రాజీ మార్గం సూచించి నందుకు నిజామాబాదు జిల్లాకు 4వ స్థానం మించిందని సిపి సాయి చైతన్య సంతోషంగా తెలిపారు.

జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని , ఆది మార్గమే రాజ మార్గమని అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని సిపి ప్రజలకు సూచించారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. 

ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, టి ఎస్ సి ఎస్ బి తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్. ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు,  ప్రతి జిల్లాలో డి4సి ని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే.పర్యాయవేక్షిస్తున్నట్లు సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ లో 138 సైబర్ క్రైమ్ కేసులలో రూ: 42,45,273-00  రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు  పంపించినట్లు సిపి తెలిపారు.

జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి ఫోన్ ద్వారా గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి  ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశ్వర్ రావ్ , సీఐ ముఖిద్ పాషా , సీసీ ఆర్ బి సిఐ సతీష్ , కోర్ట్ డ్యూటీ , సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, అభినందించారు.