01-06-2025 10:29:06 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పోరాడి సాధించుకున్న తెలంగాణ అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం అవుతుంది. కనీసం అమరవీల స్థూపాన్ని సైతం ఉత్సవాలకు ముస్తాబు చేయని అధికార యంత్రాంగం నేడు పనిచేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణ నడి బొడ్డున ఉన్న అమరవీరుల స్తూపంను పట్టించుకున్న నాధుడే లేరు. ఇది తెలంగాణ అమరవీరుల పై ఉన్న చిత్త శుద్ధి, ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల దీపాలతో ముస్తాబు చేస్తున్న అధికారులు, అమరవీరుల త్యాగాలను మాత్రం విస్మరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.