01-06-2025 10:25:49 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరణం కనిపిస్తుందని, ఇంతి కలల సౌధం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయ్యిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Warangal West MLA Naini Rajender Reddy) అన్నారు. ఆదివారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా పశ్చిమ నియోజవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసిన క్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, నగర కమీషనర్ అశ్విని తానాజీ వాకడే లతో కలసి 660 మంది లబ్ధిదారులకు హంటర్ రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్ లో ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ... ఇందిరమ్మ లేని ఇల్లు లేదు. గత పదేళ్లలో పరిపాలించిన పాలకులు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పట్లో ఎన్నికలు లేవు కానీ మీ సంక్షేమంపై దృష్టి సారించాం గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉంటున్నాం.అర్హులకు మాత్రమే ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రతినిధి బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి డబ్బులు ఇచ్చిన సహించేది లేదు.
మా పార్టీ వారైన, అధికారైన డబ్బులు తీసుకున్నట్టు తెలియజేస్తే పాతిక వేలు ఇస్తా, ప్రజా ప్రభుత్వంలో అర్హులకు న్యాయం చేయాలనేదే నా ఆకాంక్ష. స్మార్ట్ సిటీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. రోడ్డు చిరు వ్యాపారులకు అండగా మేము ఉంటాం ప్రతిపక్షాల మోసపూరిత మాటల వలలో పడొద్దు.ఇందిరమ్మ ఇండ్లలో అర్హులకు కొన్ని చోట్ల ఎంపిక కాలేదు అని నా దృష్టికి వచ్చింది.అర్హత ఉండి పేరు రాని వారికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తా. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతక ముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.