calender_icon.png 22 June, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు రాజకీయ పునాది ఎన్ఎస్యుఐ

21-06-2025 07:04:24 PM

చురుకుగా పనిచేసే వారికి కమిటీలలో అవకాశం

పటిష్ట నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం

రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): యువతకు ఎన్ఎస్యుఐ రాజకీయ పునాది లాంటిదని ఆ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎన్ఎస్యుఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్ఎస్యుఐ ని పటిష్టం చేయాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకుపోతున్నామని పేర్కొన్నారు. గతంలో ఉన్న పాత కమిటీలన్నీ రద్దుచేసి త్వరలో కొత్త కమిటీలను వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చురుకుగా పనిచేసే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయాలలోకి రావాలనుకునే వారికి మంచి మార్గమని తెలిపారు. 

ప్రతి నియోజకవర్గంలో పర్యటించి మంచి కమిటీలను వేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కమిటీలలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని, ఒకవేళ వేసిన పేపర్ లీకేజీలతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు.విద్యార్థులకు ఫీజు రియంబర్రిమెంట్స్ కూడా రాలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని నిరోధించడానికి అన్ని యూనివర్సిటీల్లో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. ఇంతకు ముందు ఉన్న కమిటీలలో సమస్యలు ఉంటే చర్చించుకుందాం అని పేర్కొన్నారు. పనిచేసే వాళ్లను ఆర్గనైజేషన్ లోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.త్వరలోనే  జిల్లాస్థాయి కమిటీలను పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో  జిల్లా ఇన్చార్జీలు ప్రతీక్ సింగ్, పహాద్, నేషనల్ లీగల్ సెల్ కన్వీనర్ అక్బర్ తో పాటు స్థానిక నాయకులు అల్లి అంజన్ కుమార్ యాదవ్, బైరు ప్రసాద్, తన్నీరు శ్రవణ్, వెంకటస్వామి, సర్దార్ నాయక్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.