calender_icon.png 21 June, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశంలో పుట్టిన యోగా ప్రపంచ దేశాలు ఆచరించడం దేశ గొప్పతనం...

21-06-2025 07:01:27 PM

ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు..

యోగాసనాలు వేసిన ఎంపీ, ఎమ్మెల్యే..

అదిలాబాద్ (విజయక్రాంతి): ప్రపంచమంతా భారతదేశంలో పుట్టిన యోగను ఆచరిస్తోందంటే ఇది మన దేశం గొప్పతనం అని ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) అన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో చెప్పిన ఆ మాటలను ప్రపంచ దేశాలు అన్ని కూడా భారతదేశ చెబుతున్న మాటలు నమ్మాల్సిందేనన్నారు. అంతర్జాతీయ యోగా డే(International Yoga Day) సందర్భంగా ఆదిలాబాద్ లో ఆయుష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి తో కలిసి ఆయన పాల్గొన్నారు. యోగా భవనంలో, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అధికారులు, ప్రజలతో  కలిసి యోగాసనాలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ... ప్రపంచమే సంబరపడే విధంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యోగ జరుపుతుందంటే ఎక్కడో భారత దేశంలో పుట్టినటువంటి యోగ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారన్నారు. మేము సైన్స్ లో బాగా అభివృద్ధి చెందిన మాకు అన్ని విషయాలు తెలుసు ఏండ్ల సంవత్సరాల నుంచి గొప్పలు చెప్పుకున్నటువంటి దేశాలు కూడా మన భారతదేశం మార్గాన్ని ఎంచుకొని, యోగ లో పాలు పంచుకుంటున్నారంటే మన దేశం గొప్పతనం ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట అనుసరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు  బ్రహ్మానంద్, లాలామున్న భీమేషన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు.