29-05-2025 02:55:45 AM
- నివాళులర్పించిన కార్పొరేటర్లు, నాయకులు
ఎల్బీనగర్, మే 28 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట సింహం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రప టాలు, విగ్రహాలకు వివిధ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
వనస్థలిపురం పనామా చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కుట్ల నర్సింహ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, నాయకులు స్వర్ణ మాధవి, భీమిడి రామకృష్ణారెడ్డి, కృష్ణమూర్తి, దాము మహేందర్ యాదవ్, శ్రావణ్ గుప్తా, అంతటి శ్రీనివాస్ గౌడ్, రేణు గౌడ్ , దుబ్బాక గోపాల్ రెడ్డి, సత్యనారాయణ, మల్లికార్జున్ పాల్గొన్నారు.
వనస్థలిపురం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రాంతీయ గౌరవాన్ని పెంపొందించి, సామాన్య ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని అన్నారు.
ముఖ్యమంత్రిగా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. తెలుగు జాతి మహోన్నత శిఖరం ఎన్టీఆర్ అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకుడు, సామాజిక కార్యకర్త గద్దె విజయ్ నేత అన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పొందూ రు వెంకటేశ్వరరావు, గోవర్ధన్ చౌదరి, కశ్యప్, వెంకటేశ్వరరావు, భాగ్యరాణి, ప్రసాద్ బాబాయ్, సవితాచౌదరి, హజ్రత్ నాయు డు, ఆంజనేయులు, కార్పెంటర్ శీను, కుమా ర్ యాదవ్, నాగరాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ యుగపురు షుడు అని వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు నర్సిం హ యాదవ్, డైరెక్టర్ రామారావు, సామ మహేశ్వర్ రెడ్డి, సాయి కిరణ్ గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, వేములయ్య గౌడ్ పాల్గొన్నారు.