calender_icon.png 30 May, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి అయ్యేనా?

29-05-2025 02:53:00 AM

- పట్టువదలని విక్రమార్కుడిలా విశ్వ ప్రయత్నం 

- తనకు ఉన్న పలుకుబడి ద్వారా పూర్తి లాబీయింగ్ 

-  మంత్రివర్గ విస్తరణపై  అధిష్టానం గ్రీన్ సిగ్నల్ 

- గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మల్‌రెడ్డి 

రంగారెడ్డి,మే 28 (విజయ క్రాంతి ): రాష్ర్టంలో మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావావుల్లో మళ్ళీ కదలిక మొదలైంది. రాష్ర్టంలో కేబినెట్ విస్తరణ పై గత మూడు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత కేసి వేణుగోపాల్ సుదీర్ఘ మంతనాలు జరిపారు.

సామాజిక సమీకరణలు జిల్లాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యే వివరాలను అధిష్టానం ఇప్పటికే సేకరించింది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,రెడ్డి సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాను సైతం రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అనంతరం మంత్రి పదవి విస్తరణలో మొదలు తన పేరు తప్పకుండా ఉంటుందని ఎంతో ధీమా పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి విషయంలో ఆదిలోనే ఆయనకు చుక్కెదురైంది. మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో  దక్కని మంత్రి పదవి....రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఎలాగైనా చోటు  దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

గత ఏడాది న్నర నుంచి ఆయన మంత్రి పదవి దక్కించుకునేందుకు  లాబీయింగ్ సాగిస్తూనే ఉన్నారు. మంత్రి పదవి కోసం తొక్కని గడపలేదు...కలవని మనిషంటూ లేడు.మంత్రి పదవీ పైరవీలో తలమునకైలయినా మల్రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గంలో తక్కువ ఢిల్లీలో ఎక్కువ అంటూ ఆయనపై నియోజకవర్గ  ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం సెటైర్లు వేయడం నియోజకవర్గం లో హాట్ టాఫీక్ గా ఈ అంశం మారింది.

దీంతో ఆయన మంత్రి పదవి పై ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు దీన్నిబట్టే అర్థమవుతుంది.మంత్రివర్గ విస్తరణ బెర్త్ లో  చోటు దక్కించుకునేందుకు  ఏ అవకాశం ఉన్న వదలడం లేదు... గల్లి నుంచి మొదలుకొని అగ్రరాజ్యం వరకు తనకున్న పలుకుబడిని వినియోగించుకొని పట్టువదలని విక్రమార్కుడిలా పూర్తి లాబింగ్ నడిపిస్తున్నాడు.

అధిష్టానం ఆలోచన ఎలా ఉందో.....

 మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు కేటాయింపు విషయంలో అధిష్టానం ఏమి ఆలోచన చేస్తుందో పార్టీ నేతలకు ఎవరికి అంతుచికడం లేదు. జిల్లాలో పార్టీ నేతలు కార్యకర్తలు పార్టీ అధిష్టాన నిర్ణయం పై కొంత అసంతృప్తి రగులుతుంది పదవుల పంపకాల్లో పూర్తిగా అన్యాయం జరిగిందని సమయం సందర్భం వచ్చినప్పుడు అల్లా తన మనసులోని మాటను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి తో పాటు పార్టీ జిల్లా నేతలు బహిరంగనే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవల శంషాబాద్ లో జరిగిన జిల్లా ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సైతం మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి కేటాయించాలంటూ ఏకవాక్యంగా పార్టీ నేతలు తీర్మానం చేసిన కాపీని పార్టీ అధిష్టానానికి సైతం పంపారు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ప్రపంచ స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న పూర్తి సిటి తమ జిల్లాలోనే ఉందని తమ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాథమిథ్యం లేకపోతే ఎలా అంటూ వారు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు సమాచారం రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనా అంటూ కరాకండిగా నేతలు ఒకే మాటగా చెబుతున్నారు. 

మంత్రి వర్గ విస్తరణలో  తనకు అవకాశం దక్కకపోతే ఎమ్మెల్యే పదవికి సైతం తాను రాజీనామా కు సిద్ధమంటూ ఆయన బెదిరింపులు సైతం దిగారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సామాజిక సమీకర ణే అడ్డుగా మారితే తాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన ప్లేసులో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానంటూ అతనికి మంత్రి పదవి కేటాయించా లని సైతం ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ఈ కామెంట్   జిల్లాలో ఇది హాట్ టాపిక్  చర్చ నియాంశంగా మారింది. మరోపక్క  పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని సైతం రంగంలోకి దింపి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ అధిష్టానా నికి సైతం లేఖను మద్దతుగా పంపించేలా చేశారు. మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం మళ్లీ  కదలిక మొదలు కావడంతో గత వారం రోజులుగా మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. తన అంచర వర్గం ని ఢిల్లీకి రప్పించుకొని మంతనాలు సాగిస్తున్నాడు.

అధిష్టానం తీసుకునే నిర్ణయాల వల్ల తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం దీంతో మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహారం అధిష్టానం కు కొంత తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. వాస్తవానికి సర్పం స్థాయి నుంచి ఎదిగిన సీనియర్ నేత  మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా పరంగా చూస్తే మంత్రివర్గంలో ఆయనకు ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సి ఉంది.  కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఏమీ ఆలోచన చేస్తుందో ఎవరికి అంతు పట్టడం లేదు.

రంగారెడ్డి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటే ఇబ్రహీంపట్నం,షాద్నగర్, కల్వకుర్తి నియోజకవర్గం సింహభాగం( ఆమనగల్, కడ్తాల, తలకొండపల్లి,మాడుగుల ) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.... ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి రాజేంద్రనగర్ నుంచి ప్రకాష్ గౌడ్ చేవెళ్ల నుంచి కాలే యాదయ్య శేర్లింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ లు టిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే  మారిన రాజకీయ పరిణామాల కారణంగా వారంతా ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇద్దరి మధ్యనే తీవ్ర పోటీ....

 మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం జాబితాపై కొలికి వచ్చినట్లు సమాచారం. అయితే రెడ్డి సామాజిక వర్గం విషయంలోనే అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు పార్టీ పెద్దలు చెప్తున్నారు. పార్టీ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య మంత్రివర్గ విషయంలో బిగ్ ఫైట్ నడుస్తుంది ఆది నుంచి మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఇరువురు నేతలు సైతం విశ్వ ప్రయత్నాలు సైతం చేస్తూ వస్తున్నారు.

బహిరంగల వేదికల మీదనే మంత్రి పదల గురించి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం పార్టీలో ఆ టాపిక్ గా మారింది.... అధిష్టానం మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించి మల్రెడ్డి రంగారెడ్డికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్లు ఇవ్వాలని కొంత ఇంటు ఇచ్చినట్లు తెలుస్తుంది.. తనకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వద్దు అంటూ తన అనుచరు వర్గం వద్ద మల్రెడ్డి రంగారెడ్డి కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.

తన నిర్ణయాన్ని  ఇప్పటికే పార్టీ వ్యవ హారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించినట్లు తెలుస్తుంది. అధిష్టానం మాత్రం మంత్రి పదవులు అవకాశం లేని వారికి  పార్టీ మంచి పొజిషన్ కల్పిస్తామంటూ  బుజ్జగింపుల పర్వం ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు వార్తలు సైతం చెక్కలు కొడుతున్నాయి.

మల్ రెడ్డి రంగారెడ్డి అనుచరులు మాత్రం   ఎంతో ధీమాగా ఉన్నారు. తమ నేతకే మంత్రి పదవి దక్కుతుందని మా సార్ బుగ్గ కారు తప్పక ఎక్కుతాడంటూ వారంతా ఎంతో ధీమగా ఉన్నారు.  చూడాలి మరి మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటుందో...రంగారెడ్డి జిల్లా  కు మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందో  లేదో వేచి చూడక తప్పదు మరి.