26-04-2025 12:00:00 AM
కాటారం, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : గర్భిణీలు, పౌష్టికాహారం పై అవగాహన కలిగి ఉండాలని గుండ్రాత్ పల్లి అంగన్వాడి టీచర్ వేమునూరి వెంకట్ లక్ష్మి అన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించే పోషణ పక్వాడ్ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గుండ్రాత్పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ లక్ష్మి మాట్లాడుతూ యుక్త వయసు బాలికలకు రక్తహీనతపై అవగాహన కల్పించారు.
పౌష్టికాహారం ఉపయోగించే వంటకాలు తయారు చేయడంపై అవగా హన కల్పించారు. అందుబాటులో ఉండే ఆకుకూరలు, పాలు పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు మొదలగున్నవి తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండగలరని అన్నారు. రెండు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలను పూర్వ ప్రాథమిక విద్య అందించడం వలన శారీరక మానసిక అభివృద్ధి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ, ఆయాలు, పలువురు పాల్గొన్నారు.