calender_icon.png 8 June, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవు దూడను చంపిన కేసులో ఒకరి అరెస్ట్

02-06-2025 12:00:00 AM

  1. ఆవు మాంసాన్ని అటవీ జంతువుల మాంసంగా అమ్మేందుకు యత్నం
  2. డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడి

ఆదిలాబాద్, జూన్ 1(విజయక్రాంతి) :  బోరజ్ మండలం గిమ్మ గ్రామ శివారులో ఆవు దూడను కత్తితో పొడిచి చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆవు దూడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని సమాచారం తెలిసిన వెంటనే జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్త్స్ర గౌతమ్, వెటర్నరీ డాక్టర్ తో కలిసి సంఘటన స్థలానికి వెళ్లగా, అక్కడ కొన ఊపిరితో ఉన్న దూడను బ్రతికించే ప్రయత్నం చేయాగ, కొద్ది సేపటికి ఆవు దూడ ప్రాణాలను విడిచిందన్నారు.

ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ చనిపోయిన ఆవు దూడ సిర్సన్న గ్రామానికి చెందిన సాయి కుమార్ ది గుర్తించగా, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవు దూడ ను చంపిన రాథోడ్ సంజయ్ ని అరెస్టు చేసి, ఆవును చంపడానికి ఉపయోగించిన కత్తి, తాడు ను స్వాదీనం చేసుకునట్లు తెలిపారు. నిందితుడి పై ఇదివరకే పలు ఫారెస్ట్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

నిందితుడు ఇలా చంపిన ఆవు దూడ మాంసాన్ని అటవీ జంతువుల మాంసంగా విక్రయించే ప్రయ త్నం చేస్తాడని విచారణలో తేలిందన్నారు. ఆవులను చంపిన, అక్రమంగా రవాణా చేసిన, అక్రమంగా అమ్మిన చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘించిన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయబడతాయని హెచ్చరించారు.