calender_icon.png 8 June, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికులకు సొంతిల్లు అమలు చేయాలి

02-06-2025 12:00:00 AM

సీఐటీయూ

మంచిర్యాల, జూన్ 1 (విజయక్రాంతి) : సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేశారు.

గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే అంశం మీద ఎన్నికల నేపథ్యంలో మాత్రమే మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారని, తెలంగాణలోని అతి పెద్ద సంస్థ అయిన సింగరేణి ఏడు జిల్లాలలో విస్తరించి ఉండి రాష్ట్రానికి దేశానికి వెలుగులు ఇస్తున్న సంస్థగా పేరు పొందు తూ, సింగరేణి కార్మికులకు మాత్రం రిటైర్మెంట్ అయిన తర్వాత సొంతిల్లుకు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

30 సంవత్సరాల సింగరేణిలో పనిచేసిన తర్వాత పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, కుటుంబాల ఆరోగ్య పరిస్థితులకే డబ్బులు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబికాదర్బార్ బత్తికి సంబంధించిన చిన్న కంపెనీల నుంచి రిలయన్స్ లాంటి అతి పెద్ద కంపెనీల వరకు వివిధ సంస్థల్లో వారి సంస్థల పేరు మీద సొంత ఇల్లులతో కాలనీలు ఉన్నప్పటికీ మన సింగరేణిలో మాత్రం అటు వంటి పరిస్థితి లేదని, సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలను సొంతింటి కల అమలు చేస్తారని నమ్మి కార్మికులంతా ఏకతాటిగా ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  గెలిపించారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలంలో సొంతిల్లు నిర్మాణానికి హామీ ఇచ్చి వెంటనే అట్టి పనులు ప్రారంభించి సహకరించాలని కోరారు.