02-06-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, జూన్ 1 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నివాసి అందే వీరస్వామి సింగరేణి కోల్ మైన్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ నియామక పత్రాన్ని వీరస్వామికి అందజేశారు.
ఐఎన్టీయూసీ యూనియన్లో కేంద్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించినందుకుగాను అందెవీరస్వామి జనక్ ప్రసాద్ కీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన కీలక బాధ్యతల్ని తాను నెరవేరుస్తూ యూనియన్ బలోపేతానికి పాటుపడతానని అందెవీరస్వామి తెలిపారు.