మరొక్క అడుగే!
26-05-2024 12:05 AM
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. గాయం నుంచి తిరిగి కోలు కున్న అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక సతమతమవుతున్న ఈ తెలుగమ్మాయి.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ సత్తాచాటింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 13 21 21 బుసానన్ (థాయ్లాండ్)పై విజ యం సాధించింది. ఒక్కో పాయింట్ కోసం ఇరువురు ప్లేయర్లు కొదమ సింహాల్లా పోరాడటంతో సెమీస్ పోరు సుదీర్ఘంగా సాగింది. దాదాపు గంటన్నర పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత తిరిగి పుంజుకుంది.
ఫైనల్లో పీవీ సింధు
మలేషియా మాస్టర్స్






