11-11-2025 12:00:00 AM
టీ20 ప్రపంచకప్పై గంభీర్ కామెంట్స్
ముంబై, నవంబర్ 10 : టీ ట్వంటీ ఫార్మాట్లో ప్రస్తుతం టీమిండియా నెంబర్ వన్ టీమ్.. 2024 లో ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పొట్టి ఫార్మాట్ను శాసిస్తోంది. పొట్టి క్రికెట్లో తిరుగులేని జట్టుగా కొన సాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో మరోసారి ఈ ఫార్మాట్లో తన ఆధిపత్యం నిరూపించుకుంది. కాగా ఇప్పుడు టీ20 ప్రపంచకప్కు సమయం దగ్గర పడుతోంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీకి కేవలం మూడు నెలలే మిగిలుంది.
అయితే అప్పటికీ 15 మంది స్కాడ్లో ఎవరు చోటు దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారిం ది. అలాగే కొన్ని సమస్యలకు ఇంకా పరిష్కారం కూడా దొరకలేదు. తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అంగీకరించాడు. కొన్ని లక్ష్యాలను ఇంకా పూర్తిగా అందుకోలేదని చెప్పాడు. ఈ సందర్భంగా గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిట్నెస్ విషయంలో రాజీపడేది లేదని, మెగాటోర్నీకి ప్రతీ ప్లేయర్ 100 శాతం ఫిట్గా ఉండాల్సిందేనని క్లారిటీ ఇచ్చేశాడు.
ఫిట్గా ఉంటేనే జట్టులో ప్లేస్ ఉం టుందన్న విషయాన్ని తేల్చి చెప్పేశాడు. ఈ మధ్యకాలంలో భారత క్రికెటర్లకు వరుస గాయాలు, ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే దీనిపై గంభీర్ ఆటగాళ్లకు ఒకవిధంగా వార్నింగ్ ఇచ్చాడు. ఫామ్ తో పాటు ఫిట్నెస్తో ఉంటేనే జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు. ఇదిలా ఉంటే మెగాటోర్నీలో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవా లనుకుంటున్న భారత్కు కొన్ని సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి.
ము ఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సిరీస్లు గెలుస్తున్నంత కాలం అతని ఫామ్ గురించి ఎవ్వరూ పట్టించుకోరన్న విషయం అందరికీ తెలుసు. కానీ ప్రపంచకప్ లాంటి టోర్నీకి ముందు భారత కెప్టెన్ ఖచ్చితంగా ఫామ్ అందుకోవాల్సిందే. ఎందుకంటే 360 డిగ్రీ స్ ప్లేయర్గా పేరున్న సూర్యకుమార్ భారత టీ ట్వంటీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వా త చెప్పుకోదగిన ఇన్నిం గ్స్ ఒక్కటీ ఆడలేదు.
ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్లోనూ ఇదే పరిస్థితి. దీంతో స్కై ఫామ్ అందుకు నేందుకు ఇంకా రెండు సిరీస్లు మాత్రమే మిగిలున్నాయి. మరోవైపు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ది కూడా ఇదే పరిస్థితి. ఓపెనర్గా అభిషేక్ శర్మతో కలి సి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న గిల్ షార్ట్ ఫార్మాట్లో ఫెయిలవుతున్నాడు. ఐపీఎల్ ప్రతీ సీజన్లోనూ దుమ్మురేపుతున్న ప్రిన్స్ అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం మెరుపులు మెరిపించలేకపోతున్నాడు.
ఇటీవల ఆసీస్పై నాలుగో టీ20లో 46 రన్స్ చేసినా నిదానంగా ఆడడంపై విమర్శలు వచ్చాయి. దీంతో తన ప్రియశిష్యుడు గిల్ ఫామ్ కూడా కోచ్ గంభీర్కు టెన్షన్గా మారింది. అలాగే వికెట్ కీపర్ విషయంలోనూ గంభీర్ తేల్చుకోలేకపోతున్నాడు. సంజూ శాంసన్, జితేశ్ శర్మలలో ఒకరికే ఛాన్స్ దక్కనుంది. ఆసీస్తో సిరీస్లో సంజూ విఫలమవగా.. జితేశ్ శర్మ రాణించాడు.
అటు ఫినిషర్ రోల్ కోసం రిం కూ సింగ్, స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, పేస్ ఆల్రౌండర్గా నితీశ్కుమార్ రెడ్డి, తన శిష్యుడు హర్షిత్ రాణా విషయాల్లోనూ గంభీర్ తర్జన భర్జన పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్కు ముందు జట్టు కూర్పు ను సెట్ చేసుకునేందుకు, 15 మందిని ఎంపిక చేసుకునేందుకు భారత్కు ఇంకా 10 మ్యాచ్లు మాత్రమే మిగిలున్నాయి. వీటిలో 5 మ్యాచ్లు సౌతాఫ్రికాతోనూ, మరో 5 మ్యాచ్లు న్యూజిలాండ్తోనూ ఆడనుంది.