1 July, 2026 | 10:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలి

05-04-2025 04:26 PM

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్..

ఖానాపూర్ (విజయక్రాంతి): ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ డిమాండ్ చేశారు. శనివారం ఖానాపూర్ విశ్రాంతి భవనంలో ఆ సంఘం, ఏప్రిల్ 8న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రజా ధర్నా కార్యక్రమం గోడ ప్రతులను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరిట చత్తీస్గడ్ రాష్ట్రంలో హత్యకాండ చేస్తుందని, దీనిలో అత్యధికంగా ఆదివాసి జాతి నష్టపోతుందని, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కగార్ ఆపరేషన్ చేపట్టి అమాయక ప్రజలను హతమార్చడం సిగ్గుచేటని, దీనిని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఆలోచన పరులు, తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. అడవి సంపదను అదానికి అప్పగించడానికి ఈ ఆపరేషన్ చేపట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, గోనే స్వామి, గూట్ల ప్రసాద్, రేగుల గంగన్న, రాములు, తదితరులు ఉన్నారు.