18-11-2025 07:26:04 PM
కామారెడ్డి (విజయక్రాంతి): నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో JKAI అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర షోటోకన్ కరాటే ఛాంపియన్షిప్–2025 పోటీలలో కామారెడ్డి ఆర్కిడ్స్ హై స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థుల్లో అబిష్, చరణీ గోల్డ్ మెడల్స్ సాధించి పాఠశాల పేరును గర్వంగా నిలబెట్టారు. అలాగే తమన్నా, జవేరియా సిల్వర్ మెడల్స్ సాధించగా వర్షిత, ఇశాంక్ సాంబశివ మెరిట్ బహుమతులను అందుకున్నారు. ఈ విజయం వెనుక పాఠశాలలో జరుగుతున్న సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో బ్లాక్ సెకండ్ DAN ట్రైనర్ సుమాంజలి పర్యవేక్షణలో విద్యార్థులు పొందిన శిక్షణ కీలక పాత్ర పోషించిందన్నారు.
విద్యార్థుల ఈ అద్భుత ప్రతిభను అభినందిస్తూ పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ సిహెచ్. గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్, ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మా విద్యార్థులు చదువుతో పాటు కరాటే, యోగా, క్రీడలు తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ పాఠశాల కీర్తిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిలబెడుతున్నారు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.