14-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి13 (విజయక్రాంతి): ఓయూలో నిర్వహించనున్న పీజీ 1వ సెమిస్టర్పరీక్షలు వాయిదా వేసింది. తమకు సిలబస్ పూర్తి కాలేదని, దీంతో పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు గత రెం డ్రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిపై గురువారం విద్యార్థులు, ఆయా విభాగాల డీన్లలో వేరువేరుగా వైస్ చాన్స్లర్ ప్రొఫె సర్ కుమార్ చర్చించారు. అనంతరం విద్యార్థుల అభ్యర్తన మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించడంతో పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన పరీ క్షలను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామని, త్వరలో అందుకు సంబంధించిన టైమ్ టేబుల్ ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.